సాగర్‌లో నాగ్‌పూర్‌ బౌద్ధులు

ABN , First Publish Date - 2022-07-04T06:24:45+05:30 IST

నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ హిల్‌కాలనీలోని బుద్ధవనాన్ని నాగ్‌పూర్‌, మహారాష్ట్రకు చెందిన 54మంది బౌద్ధులు సందర్శించారు.

సాగర్‌లో నాగ్‌పూర్‌ బౌద్ధులు
బుద్ధవనాన్ని పరిశీలిస్తున్న బౌద్ధులు

నాగార్జునసాగర్‌, జూలై 3: నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ హిల్‌కాలనీలోని బుద్ధవనాన్ని నాగ్‌పూర్‌, మహారాష్ట్రకు చెందిన 54మంది బౌద్ధులు సందర్శించారు. ప్రతీ ఆదివారం నిర్వహించే ధ్యాన తరగతుల్లో పాల్గొన్న అనంతరం బుద్ధవనంలోని చరితవనం, జాతకవనం, మహాస్తూపం తదితర ప్రాంతాలను తిలకించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాగర్‌లో బుద్ధుని జీవిత ఘట్టాలను ఒకేచోట పెద్ద పార్కులో నిర్మించడం గొప్ప విషయమని, బుద్ధుని శాంతి సందేశాన్ని ప్రచారం చేస్తామని తెలిపారు. 


ధ్యాన తరగతులకు విశేష స్పందన

బుద్ధవనంలో ప్రతీ ఆదివారం నిర్వహించే ధ్యాన తరగతులకు విశేష స్పందన లభిస్తున్నట్లు బుద్ధవనం అధికారులు తెలిపారు. ఆదివారం నిర్వహించిన ధ్యాన తరగతులకు హైదరాబాద్‌ నుంచి ఓషో ఫ్యామిలీకి చెందిన 40 మంది, కరీంనగర్‌, జార్ఖండ్‌, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి సుమారు 70 మంది ధ్యాన తరగతుల్లో పాల్గొన్నారు.

Updated Date - 2022-07-04T06:24:45+05:30 IST