మాజీ కోఆప్షన్‌ సభ్యుడికి టీడీపీ నేతల పరామర్శ

ABN , First Publish Date - 2022-08-09T03:00:01+05:30 IST

కందుకూరు మున్సిపల్‌ మాజీ కోఆప్షన్‌ సభ్యుడు సయ్యద్‌ నజీర్‌ను సోమవారం టీడీపీ ఇన్‌చార్జి ఇంటూరి నాగేశ్వరరావు, మాజీ ఎ

మాజీ కోఆప్షన్‌ సభ్యుడికి టీడీపీ నేతల పరామర్శ
నజీర్‌ను పరామర్శిస్తున్న మాజీ ఎమ్మెల్యే దివి శివరాం, ఇంటూరి నాగేశ్వరరావు తదితరులు

కందుకూరు, ఆగస్టు 8: కందుకూరు మున్సిపల్‌ మాజీ కోఆప్షన్‌ సభ్యుడు సయ్యద్‌ నజీర్‌ను సోమవారం టీడీపీ ఇన్‌చార్జి ఇంటూరి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే దివి శివరాంలు పరామర్శించారు. నజీర్‌ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకున్న వారిద్దరూ నజీర్‌ ఇంటికెళ్లి పరామర్శించారు.  ఈ సందర్భంగా 7వ వార్డులో కరోనా సమయంలో వైద్యసేవలందించిన ఆర్‌ఎంపీలు ఎం. ప్రసాదు, షేక్‌ నజీర్‌ అహ్మద్‌లకు స్థానికులు సన్మానం ఏర్పాటు చేయగా శివరాం, నాగేశ్వరరావులు హాజరై వారిని సత్కరించారు.  కార్యక్రమంలో పార్టీ నాయకులు దామా మల్లేశ్వరరావు, గౌస్‌బాషా,  రూబీ, షేక్‌ మహబూబ్‌బాషా, ఖాదర్‌వలీ, జలీల్‌, జాకీర్‌, ఖలీల్‌, సలాం, మున్నా తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-09T03:00:01+05:30 IST