నాగావళి తీరంలో అపస్మారక స్థితిలో వ్యక్తి
ABN , First Publish Date - 2021-04-12T04:58:12+05:30 IST
మండలంలో బొడ్డవలస నాగావళి నదీ తీరంలో గుర్తుతెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. ఈ సంఘటనను ఆదివారం ఉద యం స్థానికులు గుర్తించి రేగిడి పోలీసు లకు సమాచారం అందించారు.
రేగిడి: మండలంలో బొడ్డవలస నాగావళి నదీ తీరంలో గుర్తుతెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. ఈ సంఘటనను ఆదివారం ఉద యం స్థానికులు గుర్తించి రేగిడి పోలీసు లకు సమాచారం అందించారు. ఎస్ఐ షేక్ మహా మ్మద్ ఆలీ సిబ్బంది అక్కడికి చేరుకుని ఈ వ్యక్తి ప్రాణాలతో ఉన్నట్లు గుర్తించి 108లో పాలకొండ ఆసుపత్రికి తరలించారు. ఇతడి వయసు 45 ఏళ్లు ఉంటుందని, ఇతని సమాచారాన్ని సేకరిస్తున్నామని ఎస్ఐ తెలిపారు.