అక్రమ రేషన్ బియ్యం తరలిస్తుండగా ప్రమాదం...

ABN , First Publish Date - 2020-12-03T13:05:51+05:30 IST

జిల్లాలోని కల్వకుర్తిలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు గాయపడ్డారు.

అక్రమ రేషన్ బియ్యం తరలిస్తుండగా ప్రమాదం...

నాగర్‌కర్నూల్: జిల్లాలోని  కల్వకుర్తిలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు గాయపడ్డారు.  అక్రమంగా రేషన్ బియ్యం లోడుతో వెళ్తుతున్న బొలెరో వాహనం అదుపుతప్పి కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. బొలెరో వాహనం ఢీకొన్న ధాటికి కారు నుజ్జునుజ్జు అయ్యింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2020-12-03T13:05:51+05:30 IST