నాగర్కర్నూల్ కలెక్టరేట్ ముందు మహిళ ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2021-07-14T18:00:23+05:30 IST
జిల్లా కలెక్టరేట్ ముందు ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపుతోంది.
నాగర్ కర్నూల్: జిల్లా కలెక్టరేట్ ముందు ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపుతోంది. బిజినపల్లి మండలం సల్కరిపేట గ్రామానికి చెందిన జ్యోతి అనే మహిళ భూ పరిష్కారం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ పెట్రోల్ పోసుకుని బలవన్మరణానికి యత్నించింది. నిప్పు అంటించుకునే సమయంలో అడ్డుకున్న సెక్యూరిటీ గార్డు, ఉద్యోగులు...మహిళను అదనపు కలెక్టర్ చాంబర్కు తీసుకెళ్లారు.