నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద
ABN , First Publish Date - 2020-10-23T16:09:24+05:30 IST
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుండటంతో అధికారులు 18 క్రస్ట్ గేట్స్ ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు.
నల్గొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుండటంతో అధికారులు 18 క్రస్ట్ గేట్స్ ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 3,51,910 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 3,47,542 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0450 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ 310.849 టీఎంసీలుగా నమోదు అయ్యింది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను... ప్రస్తుత నీటిమట్టం 589.60 అడుగులకు చేరింది.