589.90 అడుగులకు చేరిన నాగార్జునసాగర్ నీటిమట్టం

ABN , First Publish Date - 2021-10-05T13:24:34+05:30 IST

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు నాలుగు క్రస్ట్ గేట్ల ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

589.90 అడుగులకు చేరిన నాగార్జునసాగర్ నీటిమట్టం

నల్లగొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు నాలుగు క్రస్ట్ గేట్ల ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో , అవుట్ ఫ్లో 73, 666 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటిమట్టం 590.00 అడుగులకు గాను ప్రస్తుత నీటిమట్టం 589.90 అడుగులకు చేరింది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా...ప్రస్తుత సామర్థ్యం 311.7462 టీఎంసీలుగా కొనసాగుతోంది. 

Updated Date - 2021-10-05T13:24:34+05:30 IST