నాగార్జున కొండకు పర్యాటకులతో వెళ్లిన లాంచీ
ABN , First Publish Date - 2021-06-22T06:23:31+05:30 IST
ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునకొండకు సోమవారం పర్యాటకులతో కూడిన లాంచీ వెళ్లింది. కరోనా నేపథ్యంలో నిలిచిన లాంచీలు తిరిగి కొండకు చేరుకుంటున్నాయి.
విజయపురిసౌత్, జూన్ 21: ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునకొండకు సోమవారం పర్యాటకులతో కూడిన లాంచీ వెళ్లింది. కరోనా నేపథ్యంలో నిలిచిన లాంచీలు తిరిగి కొండకు చేరుకుంటున్నాయి. దీంతో పర్యాటక శాఖకు ఆదాయం సమకూరనుంది. పర్యాటకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని లాంచీ యూనిట్ మేనేజర్ స్వామి కోరారు.