నగరి నియోజకవర్గాన్ని బాలాజీ జిల్లాలో కలపాలి

ABN , First Publish Date - 2022-01-29T06:44:31+05:30 IST

నగరి నియోజకవర్గాన్ని బాలాజీ జిల్లాలో కలపాలని పుత్తూరు పట్టణ టీడీపీ అధ్యక్షుడు జీవరత్నం నాయుడు, ప్రధాన కార్యదర్శి ధనపాల్‌ డిమాండ్‌ చేశారు.

నగరి నియోజకవర్గాన్ని బాలాజీ జిల్లాలో కలపాలి
మున్సిపల్‌ అధికారులకు వినతిపత్రం అందిస్తున్న టీడీపీ నాయకులు

పుత్తూరు టౌన్‌, జనవరి 28: నగరి నియోజకవర్గాన్ని బాలాజీ జిల్లాలో కలపాలని పుత్తూరు పట్టణ టీడీపీ అధ్యక్షుడు జీవరత్నం నాయుడు, ప్రధాన కార్యదర్శి ధనపాల్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం టీడీపీ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరి నియోజకవర్గానికి బాలాజీ జిల్లాలో కొలువైన వేంకటేశ్వరస్వామికి విడదీయరాని అనుబంధం ఉందన్నారు. తిరుపతికి  పక్కనే ఉన్న నగరి నియోజకవర్గాన్ని బాలాజీ జిల్లాలో కలపాలని డిమాండ్‌ చేశారు.అనంతరం మున్సిపల్‌ అధికారులకు ఈ విషయమై వినతి పత్రం అందజేశారు. బీఎస్‌ గణేష్‌, షణ్ముగ రెడ్డి, అశోక్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ యుగంధర్‌, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు వేలు, ఎన్‌.ధనపాల్‌, తదితర నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-29T06:44:31+05:30 IST