Nagar Kurnool: ఎదురెదురుగా ఢీకొన్న రెండు బైక్లు..తండ్రికొడుకు మృతి
ABN , First Publish Date - 2021-07-30T16:40:11+05:30 IST
జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తండ్రి, కొడుకు అక్కడికక్కడే మృతి చెందగా..మరో ఇద్దరికి తీవ్ర
నాగర్ కర్నూలు: జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తండ్రి, కొడుకు అక్కడికక్కడే మృతి చెందగా..మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన బిజినపల్లి మండలంలో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు బాలయ్య గౌడ్ (65), శివ కుమార్ (35)గా పోలీసులు గుర్తించారు.