మల్లన్న దర్శనానికి వచ్చిన నాగన్న..

ABN , First Publish Date - 2020-06-30T21:54:07+05:30 IST

శ్రీశైలం ఆలయం క్యూ లైన్లలో నాగుపాము ప్రత్యక్షమైంది.

మల్లన్న దర్శనానికి వచ్చిన నాగన్న..

శ్రీశైలం ఆలయం క్యూ లైన్లలో నాగుపాము ప్రత్యక్షమైంది. కొంతసేపు పగడవిప్పి భక్తులను చూస్తూ కనువిందు చేసింది. పామును చూసిన భక్తులు భయాందోళనకు గురై ఆ తర్వాత ఆశ్చర్యానికి గురయ్యారు. సోమవారం శివుడికి ఇష్టమైన రోజు.. అందులోనూ నాగుపాము శివాలయంలోని మల్లికార్జునస్వామి ఆలయం క్యూ లైన్లలో భక్తులకు దర్శనమివ్వడంతో వారు పునీతులయ్యారు. శివుడి కంఠస్థలంలో ఉండే నాగేంద్రుడు శివాలయంలోని క్యూ లైన్లలో దర్శనమివ్వడం మంచి పరిణామంగా భావించిన భక్తులు దర్శించుకుని పునీతులయ్యారు. తర్వాత దేవస్థానం అధికారులు స్నేక్ క్యాచర్లను పిలిపించారు. వారు పామును పట్టుకుని దూరంగా అడవిలో వదిలిపెట్టారు.

Updated Date - 2020-06-30T21:54:07+05:30 IST