నామినేటెడ్ పదవుల్లో సామాజిక న్యాయం ఏమైంది?: నాగజగదీశ్వరరావు
ABN , First Publish Date - 2021-07-25T17:44:35+05:30 IST
బడుగు బలహీన వర్గాలకు వైసీపీ ప్రభుత్వం దయాదాక్షిణ్యంతో పదవులు ఇవ్వడం లేదని...
అమరావతి: బడుగు బలహీన వర్గాలకు వైసీపీ ప్రభుత్వం దయాదాక్షిణ్యంతో పదవులు ఇవ్వడం లేదని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా నాగజగదీశ్వరరావు అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సలహాదారులు, ముఖ్యమైన నామినేటెడ్ పదవుల్లో సామాజిక న్యాయం ఏమైందని ప్రశ్నించారు. కార్యాలయాలు, అధికారాలులేని కార్పొరేషన్ పదవులను బలహీలన వర్గాలకు ఇచ్చి ప్రధాన పదవులను సొంత సామాజిక వర్గానికి కట్టబెట్టడం సామాజిక న్యాయం ఎలా అవుతంది జగన్మోహన్ రెడ్డి? అంటూ నిలదీశారు.
సామాజిక న్యాయం పాటించామని సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పడం తప్ప పదవులు పొందిన వారి నోటి నుంచి రావడం లేదంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చునని నాగజగదీశ్వరరావు అన్నారు. సామాజిక న్యాయాన్ని తలకిందులు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగనేనని విమర్శించారు. పెద్ద పదవులకు బీసీలు, ఎస్సీ, ఎస్టీలు అర్హులు కాదా.?అని ప్రశ్నించారు. బడుగు బలహీన వర్గాలకు అధికారం కోసం టీడీపీ పోరాడుతుందని నాగజగదీశ్వరరావు స్పష్టం చేశారు.