నాడు ముద్దులు.. నేడు పిడిగుద్దులు!
ABN , First Publish Date - 2022-05-22T05:38:00+05:30 IST
ఎన్నికల ముందు అధికారంలోకి రావడానికి ముద్దులు కురిపించి, అధికారంలోకి వచ్చినప్పటినుండి అదే ప్రజల వీపులు బద్దలయ్యేలా ముఖ్యమంత్రి జగన్రెడ్డి పిడిగుద్దులు గుద్దుతున్నా డని రాయలసీమ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కుంచం వెంకటసుబ్బారెడ్డి విమర్శించారు.
అధోగతి పాలైన రాష్ట్రం
జగన్ పాలనపై ‘కుంచం’ విమర్శ
కడప (మారుతీనగర్), మే 21: ఎన్నికల ముందు అధికారంలోకి రావడానికి ముద్దులు కురిపించి, అధికారంలోకి వచ్చినప్పటినుండి అదే ప్రజల వీపులు బద్దలయ్యేలా ముఖ్యమంత్రి జగన్రెడ్డి పిడిగుద్దులు గుద్దుతున్నా డని రాయలసీమ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కుంచం వెంకటసుబ్బారెడ్డి విమర్శించారు. పంపకాలకే పరిమితమై ప్రగతిని మంటగలిపాబని నిప్పులు చెరిగారు శనివారం స్థానిక ప్రెస్క్లబ్లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల స మావేశంలో ఆయన మాట్లాడారు. రాయలసీమకు చెందిన పలువులు ముఖ్యమంత్రులైనా సీమ అభివృధ్ది బాట పట్టనేలేదన్నారు. 22 మంది ఎంపీలు, 151 మంది ఎంఎల్ఏలున్నా కేంద్రం ముందు మోకరిల్లుతూ, పైకి దర్పం ప్రదర్శిస్తున్నారన్నారు. ఇప్పటికైనా రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని డి మాండ్ చేశారు. జూన్ 5న కర్నూలులోని రాజవిహార్ సెంటర్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్భవన్లో నిర్వహించనున్న సమితి ప్లీ నరీ సమావేశాలు- బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. స మావేశంలో వెన్నపూస పవన్కుమార్రెడ్డి, షేక్ బాష, మిట్టా కృష్ణ పాల్గొన్నారు.