AP News: ఏపీ సర్కార్ యువత భవితను నాశనం చేసింది: నాదెండ్ల మనోహర్
ABN , First Publish Date - 2022-08-15T00:32:33+05:30 IST
ఏపీ సర్కార్ యువత భవితను నాశనం చేసిందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) దుయ్యబట్టారు.
గుంటూరు: ఏపీ సర్కార్ యువత భవితను నాశనం చేసిందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) దుయ్యబట్టారు. మంగళగిరిలో జనసేన ఐటీ వింగ్తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లో సోషల్ మీడియాది కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. అక్టోబర్ 5 నుంచి జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) యాత్ర ప్రారంభింస్తారని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయన పర్యటిస్తారని తెలిపారు. ప్రభుత్వం సంక్షేమం అంటూ అభివృద్ధిని మరిచిందని ధ్వజమెత్తారు. జగన్ (Jagan) సర్కార్ ఏపీకి పెట్టుబడులు రాకుండా చేస్తోందని మండిపడ్డారు. దావోస్ వెళ్లి ఫొటోలకు ఫోజులిస్తే రాష్ట్రానికి పెట్టుబడులు రావని పేర్కొన్నారు. హైదరాబాద్లో ఐటీరంగం దూసుకెళ్తుంటే.. ఏపీలో దిగజారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. జనసేన మేనిఫెస్టోలో ఐటీ అభివృద్ధికి ప్రత్యేకస్థానం కల్పిస్తామని నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.