వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం: నాదెండ్ల

ABN , First Publish Date - 2022-03-19T21:58:36+05:30 IST

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం: నాదెండ్ల

అమరావతి: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ప్రజలే ఆ పార్టీకి బుద్ధి చెబుతారన్నారు.   ద్వారంపూడి చంద్రశేఖర్ మాటలు చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నాయన్నారు.ఆయనకు ఇంత అహంకారం ఎక్కడ నుంచి వచ్చిందో అర్ధం కావడం లేదన్నారు. ద్వారంపూడి పెద్దఎత్తున ప్రగల్భాలు పలుకుతున్నారు. పవన్ కల్యాణ్‌ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో కూడా అనవసరంగా ఇలాంటి సమస్యలే సృష్టించారన్నారు. మా నాయకత్వాన్ని చులకన చేసే విధంగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ఇప్పటికైనా ద్వారంపూడి ప్రగల్భాలు మాని.. కాకినాడ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని చెప్పారు.రాజకీయాల్లో మనందరం గౌరవించాల్సింది ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాలరాసే విధంగా వైసీపీ పాలన సాగుతోందని మండిపడ్డారు.అధికారంలో ఉన్నాం ఏం మాట్లాడినా, ఏం చేసినా చెల్లిపోతుంది అనుకుంటే పొరపాటేనని చెప్పారు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయని చెప్పారు.  ఆ ఎన్నికల్లో ప్రజలే తమ ఓటుతో సీఎం జగన్మోహన్‌రెడ్డికి బుద్ధి చెబుతారన్నారు. వైసీపీ ప్రభుత్వం కచ్చితంగా మళ్లీ అధికారంలోకి రాదని నాదెండ్ల మనోహర్ తెలిపారు. 

Updated Date - 2022-03-19T21:58:36+05:30 IST