సీఎస్ లెక్కలు నమ్మశక్యంగా లేవు: నాదేండ్ల మనోహర్
ABN , First Publish Date - 2021-12-15T00:04:42+05:30 IST
పెన్షన్లపై సీఎస్ లెక్కలు ఉద్యోగులు, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.
అమరావతి: పెన్షన్లపై సీఎస్ లెక్కలు ఉద్యోగులు, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. 111% ఖర్చు చేస్తున్నట్లు అసెంబ్లీలో ఎందుకు చెప్పలేదు? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పింఛన్లపై సీఎస్ లెక్కలు నమ్మశక్యంగాలేవన్నారు. రాష్ట్ర బడ్జెట్లో ఎందుకు ఈ విషయం ప్రస్తావించలేదు?, ఇదే నిజమైతే ఆ విషయాన్ని అసెంబ్లీలో ఎందుకు చెప్పలేదు? అని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు.