తిరుపతి నుంచి Pawan యాత్ర: Nadendla Manohar
ABN , First Publish Date - 2022-06-11T00:31:47+05:30 IST
అమరావతి: ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో యాత్ర చేపట్టనున్నట్లు పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. అక్టోబర్లో తిరుపతి నుంచి ఈ యాత్ర
అమరావతి: ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో యాత్ర చేపట్టనున్నట్లు పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. అక్టోబర్లో తిరుపతి నుంచి ఈ యాత్ర ప్రారంభం అవుతుందన్నారు. జగన్ పాలనలో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, ప్రణాళిక లేని పాలన వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. జగన్ వర్క్ ఫ్రం హోం సీఎం అని, ప్రభుత్వాన్ని నడపడం చేతకాకే చేతులు ఎత్తేశాడని విమర్శించారు. అందుకే వచ్చే మార్చిలో జగన్ ఎన్నికలకు వెళతాడని, దీనిపై తమ వద్ద పక్కా సమాచారం ఉందన్నారు. నిజాయితీకి నిదర్శనంగా ఉండే పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమని పేర్కొన్నారు.