అయోధ్యలో నడ్డా, బీజేపీ సీఎంలు పూజలు

ABN , First Publish Date - 2021-12-15T20:24:51+05:30 IST

రామజన్మభూమిలోని మేక్‌షిఫ్ట్ టెంపుల్‌లో నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన 11 మంది ముఖ్యమంత్రులు, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు..

అయోధ్యలో నడ్డా, బీజేపీ సీఎంలు పూజలు

అయోధ్య: ''అయోధ్యలో రామాలయ నిర్మాణం దేశ ప్రజల ఏళ్ల నాటి కల. ప్రతి ఒక్కరూ భవ్యమైన రామాలయ నిర్మాణం కోరుకుంటూ వచ్చారు. వారి కలలు ఈరోజు సాకరమవుతున్నాయి'' అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. రామజన్మభూమిలోని మేక్‌షిఫ్ట్ టెంపుల్‌లో నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన 11 మంది ముఖ్యమంత్రులు, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు బుధవారంనాడు ప్రత్యేక  పూజలు చేశారు. దీనికి ముందు వీరంతా సరయూ ఘాట్, హనుమాన్ ఘర్హి ఆలయాన్ని దర్శించారు.


ప్రధాని రెండు రోజుల వారణాసి పర్యటనలో భాగంగా బీజేపీ సీఎంలంతా ఆయనతోనే ఉన్నారు. మంగళవారంనాడు ప్రధాని అధ్యక్షతన ఏర్పాటైన సమావేశంలోనూ వీరంతా పాల్గొన్నారు. పాలనలో ప్రతిభ చూపాలని, మెరుగైన ప్రజాజీవనానికి సీఎంలు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రులకు ప్రధాని సూచనలిచ్చారు.

Updated Date - 2021-12-15T20:24:51+05:30 IST