తెలంగాణకు జేపీ నడ్డా, యోగి ఆదిత్యనాథ్
ABN , First Publish Date - 2022-03-13T20:51:42+05:30 IST
నాలుగు రాష్ట్రాల్లో సాధించిన అద్భుత ఫలితాల ఉత్సాహంతో బీజేపీ జాతీయ నాయకత్వం ఇక తెలంగాణను టార్గెట్ చేసేందుకు సిద్ధమవుతోంది.
హైదరాబాద్: నాలుగు రాష్ట్రాల్లో సాధించిన అద్భుత ఫలితాల ఉత్సాహంతో బీజేపీ జాతీయ నాయకత్వం ఇక తెలంగాణను టార్గెట్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటి నుంచి తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టిపెట్టేందుకు సమాయత్తం అవుతోంది. ఇక తమ ఫోకస్ తెలుగు రాష్ట్రాలపైనే ఉంటుందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అధికారాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకువెళ్తామని ఆ పార్టీ నేతలు ఇప్పటికే ప్రకటించారు. ఇందులోభాగంగా ఈనెల చివరివారంలో బీజేపీ నేత జేపీ నడ్డా, సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలంగాణకు రానున్నారు. తెలంగాణపై బీజేపీ నాయకత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. నెల చివరిలో జనగాంలో బీజేపీ నేతలు భారీ బహిరంగ సభను నిర్వహించాలని భావిస్తోంది. ఈ సభకు జేపీ నడ్డా హాజరయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర రెండోదశ కార్యక్రమాన్ని ఏప్రిల్ 14న జోగులాంబ ఆలయం నుంచి ప్రారంభించనున్నారు. దీని ప్రారంభ సమావేశానికి అమిత్ షా హాజరయ్యే అవకాశం ఉంది. 2 రోజులపాటు తెలంగాణలో అమిత్షా మకాం వేయనున్నారు.