ఎన్ఏడీ పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ABN , First Publish Date - 2022-05-23T05:05:40+05:30 IST
ఎన్ఏడీ పాఠశాల్లో 2002-2003 సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఎన్ఏడీ కాలనీలోగల ఫంక్షన్హాల్లో ఆదివారం సమావేశమయ్యారు.
ఎన్ఏడీ జంక్షన్, మే 22: ఎన్ఏడీ పాఠశాల్లో 2002-2003 సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఎన్ఏడీ కాలనీలోగల ఫంక్షన్హాల్లో ఆదివారం సమావేశమయ్యారు. 20 సంవత్సరాల తరువాత అందరూ ఒక్కచోట కలుసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలుకరించుకుంటూ, అరే ఒరే అని పిలుచుకుంటూ అనాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఎంతో సంతోషంగా గడిపారు. ఒకరినొకరు వారి యోగక్షేమాలను, ఎక్కడ విధులు నిర్వహిస్తున్నదీ, కుటుంబ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారికి విద్యాబుద్ధులు నేర్పిన విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ఎంజీ.మార్గరే, ఎస్.విజయలక్ష్మి ప్రస్తుత ప్రధానోపాధ్యాయురాలు కె.కమల కుమారిలను ఘనంగా సత్కరించారు.