శంకర్ ఫౌండేషన్ కంటి ఆస్పత్రికి నాబ్ గుర్తింపు
ABN , First Publish Date - 2021-10-20T05:22:35+05:30 IST
ఉత్తరాంధ్ర జిల్లాల్లో పేద ప్రజలకు అత్యున్నత ప్రమాణాలతో కంటి వైద్యం అందిస్తున్నందుకు శంకర్ ఫౌండేషన్ కంటి ఆస్పత్రికి క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు(నాబ్) గుర్తింపు లభించింది.
వేపగుంట, అక్టోబరు 19: ఉత్తరాంధ్ర జిల్లాల్లో పేద ప్రజలకు అత్యున్నత ప్రమాణాలతో కంటి వైద్యం అందిస్తున్నందుకు శంకర్ ఫౌండేషన్ కంటి ఆస్పత్రికి క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు(నాబ్) గుర్తింపు లభించింది. గుర్తింపు పత్రాన్ని ఆ బోర్డు ప్రతినిధి శంకర్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ కె.మణిమాలకు మంగళవారం అందజేశారు. ఈ నాబ్ గుర్తింపు 2023 వరకు అమల్లో ఉంటుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.