నాడు - నేడు పనులపై అసంతృప్తి

ABN , First Publish Date - 2021-08-06T05:47:45+05:30 IST

నాడు - నేడు పనులపై ప్రత్యేకాధికారి నాగేశ్వరరావు అసంతృప్తి వ్యక్తం చేశారు.

నాడు - నేడు పనులపై అసంతృప్తి
రికార్డులు పరిశీలిస్తున్న ప్రత్యేక అధికారి నాగేశ్వరరావు

రాచర్ల, ఆగస్టు 5 : నాడు - నేడు పనులపై ప్రత్యేకాధికారి నాగేశ్వరరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. రాచర్ల మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలో నాడు-నేడు కింద జరుగుతున్న పనుల ను మండల ప్రత్యేక అధికారి నాగేశ్వరరావు గురువారం పరిశీలించారు. మం డలంలోని గుడిమెట్ట, సోమిదేవిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలల్లో జరుగుతున్న పనులను చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటివరకు కే వలం 50శాతం మేరకు పనులు జరిగాయని, జరిగిన పనులు కూడా సక్ర మంగా లేవని  ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాచర్ల మండలం లోని దాదాపు కొన్ని పాఠశాలల్లో నాడు-నేడు కింద పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు తన దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. దీనిపై  కలెక్టర్‌కు నివేదిక అందచేయనున్నట్లు తెలిపారు. చెర్లోపల్లి, రంగారెడ్డిపల్లి పాఠశాలల పనితీరు,  పనులపట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. 


Updated Date - 2021-08-06T05:47:45+05:30 IST