కేంద్రీకృత విధానంలో పీజీ, పరిశోధన అడ్మిషన్లు
ABN , First Publish Date - 2021-05-18T04:50:37+05:30 IST
వచ్చే విద్యా సంవత్సరం నుంచి పీజీ, పరిశోఽ దన అడ్మిషన్లు కేంద్రీకృత పద్ధతిలో జరుగుతాయని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ నిమ్మ వెంకటరావు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల వీసీలతో సోమవారం వర్చువల్ పద్ధతిలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రా రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమీవేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో యూని వర్సిటీలు వేర్వేరుగా నిర్వహిస్తున్న పీజీ ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్లు పూర్తిచేస్తున్నట్టు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ విధానానికి స్వస్తి పలికి, అన్ని యూనివర్సిటీలకు కలిపి ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహించి అడ్మిషన్లు జరుగుతాయని చెప్పారు. అలాగే పరిశోధన అడ్మిషన్లకు కూడా ఇదే విధానాన్ని అవలంభిస్తారని చెప్పా రు. అంబేడ్కర్ వర్సిటీలో పరిశోధనలను ప్రోత్సహించేందు కు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తూ పీహెచ్డీ అర్హత ఉన్న అధ్యాపకులకు రీసెర్చ్ గైడ్లుగా నియమిస్తామని, ఆసక్తి, అర్హత ఉన్న అధ్యాపకులు వర్సిటీకి దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఎచ్చెర్ల: వచ్చే విద్యా సంవత్సరం నుంచి పీజీ, పరిశోఽ దన అడ్మిషన్లు కేంద్రీకృత పద్ధతిలో జరుగుతాయని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ నిమ్మ వెంకటరావు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల వీసీలతో సోమవారం వర్చువల్ పద్ధతిలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రా రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమీవేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో యూని వర్సిటీలు వేర్వేరుగా నిర్వహిస్తున్న పీజీ ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్లు పూర్తిచేస్తున్నట్టు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ విధానానికి స్వస్తి పలికి, అన్ని యూనివర్సిటీలకు కలిపి ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహించి అడ్మిషన్లు జరుగుతాయని చెప్పారు. అలాగే పరిశోధన అడ్మిషన్లకు కూడా ఇదే విధానాన్ని అవలంభిస్తారని చెప్పా రు. అంబేడ్కర్ వర్సిటీలో పరిశోధనలను ప్రోత్సహించేందు కు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తూ పీహెచ్డీ అర్హత ఉన్న అధ్యాపకులకు రీసెర్చ్ గైడ్లుగా నియమిస్తామని, ఆసక్తి, అర్హత ఉన్న అధ్యాపకులు వర్సిటీకి దరఖాస్తు చేసుకోవాలన్నారు.