మైసూరు దసరా ఉత్సవాల ఖర్చు రూ.5.42 కోట్లు
ABN , First Publish Date - 2021-11-03T16:40:37+05:30 IST
కొవిడ్ కారణంగా అత్యంత సాదాసీదాగా నిర్వహించినప్పటికీ మైసూరు దసరా ఉత్సవాల నిర్వహణకు రూ.5.42 కోట్లు ఖర్చు అయ్యాయి. ఈ విషయాన్ని జిల్లా ఇన్చార్జ్ మం త్రి ఎస్టీ సోమశేఖర్ సో
బెంగళూరు: కొవిడ్ కారణంగా అత్యంత సాదాసీదాగా నిర్వహించినప్పటికీ మైసూరు దసరా ఉత్సవాల నిర్వహణకు రూ.5.42 కోట్లు ఖర్చు అయ్యాయి. ఈ విషయాన్ని జిల్లా ఇన్చార్జ్ మం త్రి ఎస్టీ సోమశేఖర్ సోమవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. దసరా ఉత్సవాల కోసం ప్రభుత్వం రూ.6 కోట్లు విడుదల చేయగా అందులో రూ. 58 లక్షలు మిగిలాయన్నారు. ఈ మొత్తాన్ని రాచనగరి మైసూరులో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఖర్చు చేస్తామన్నారు. ఆహ్వాన పత్రికల ముద్రణకు ఎక్కువగా ఖర్చు కావడం గమనార్హం. ఉత్సవాల్లో పా ల్గొన్న కళాకారులకు పారితోషికం రూపంలో రూ.1.03 కోట్లు చెల్లించగా వేదిక నిర్మాణం, విద్యుత్ అలంకరణకు రూ.93.80 లక్షలు ఖర్చు చేశారు. ఆహ్వాన పత్రికల ముద్రణ కోసం రూ.5.91 లక్షలు, కళాకారులకు రవాణా సదుపాయం కోసం రూ.29.16లక్షలు, జంబూ సవారీ కోసం రూ.37.50 లక్షలు, శకటాల నిర్మాణానికి రూ.18. 55లక్షలు ఖర్చు అయ్యాయన్నారు.