పోలీసుల దిగ్బంధంలో మైలవరం

ABN , First Publish Date - 2022-03-08T15:45:42+05:30 IST

మైలవరం పట్టణాన్ని పోలీసులు దిగ్బంధించారు. నేడు మైలవరం బంద్‌కు మైలవరం రెవిన్యూ డివిజన్ పోరాట సాధన సమితి పిలుపునిచ్చింది.

పోలీసుల దిగ్బంధంలో మైలవరం

కృష్ణా - మైలవరం : నేడు మైలవరం బంద్‌కు మైలవరం రెవిన్యూ డివిజన్ పోరాట సాధన సమితి పిలుపునిచ్చింది.ఈ బంద్‌కు టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, ఎమ్మార్పీఎస్‌ మద్దతు తెలిపాయి.దీంతో మైలవరం పట్టణాన్ని పోలీసులు దిగ్బంధించారు. కాగా బంద్‌కు పోలీసులు అనుమతులు ఇవ్వలేదు. దుకాణాలను బలవంతంగా మూసివేస్తే అరెస్ట్ చేస్తామని ప్రతిపక్షాల నాయకులను నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు హెచ్చరించారు.

 దీంతో మైలవరంలో హోటల్స్, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు తెరుచుకున్నాయి.  బంద్‌ను నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు పర్యవేక్షిస్తున్నారు. మైలవరాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఎన్ని అడ్డంకులు కలిగించిన మైలవరం బంద్‌ను విజయవంతం చేస్తామని సాధన సమితి నాయకులు స్పష్టం చేశారు. పోలీసుల నిరంకుశ తీరుపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. 

Updated Date - 2022-03-08T15:45:42+05:30 IST