అమ్మ స్ఫూర్తితో పనిచేస్తా: కమలా హారిస్
ABN , First Publish Date - 2020-08-14T06:51:14+05:30 IST
అమెరికా ఉపాధ్యక్ష పదవికి డెమోక్రాట్ పార్టీ అభ్యర్థిగా ఎంపికైన కమలా హారిస్ తొలి ప్రసంగంలో తల్లి శ్యామలా గోపాలన్ను స్మరించుకున్నారు. అమెరికా అధ్యక్షపదవికి పోటీ పడుతున్న జో బైడెన్తో కలిసి ఆమె తొలిసారిగా...
వాషింగ్టన్, ఆగస్టు 13: అమెరికా ఉపాధ్యక్ష పదవికి డెమోక్రాట్ పార్టీ అభ్యర్థిగా ఎంపికైన కమలా హారిస్ తొలి ప్రసంగంలో తల్లి శ్యామలా గోపాలన్ను స్మరించుకున్నారు. అమెరికా అధ్యక్షపదవికి పోటీ పడుతున్న జో బైడెన్తో కలిసి ఆమె తొలిసారిగా బుధవారం డెలావర్లో మాట్లాడారు. తన భారత్-ఆఫ్రికా మూలాల గురించి మాట్లాడుతూ.. భారతీయ అమెరికన్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సమస్యలపై పోరాడేతత్వం తల్లి వల్లే తనకు, సోదరి మాయాకు అలవడిందని చెప్పారు. ఆమె స్ఫూర్తితోనే పనిచేస్తానన్నారు. కమల పేరును ప్రకటించిన వెంటనే బైడెన్కు రూ.194కోట్ల నిధులు సమకూరాయి.