ఊపిరున్నంత వరకు అండగా ఉంటా

ABN , First Publish Date - 2021-08-04T06:24:13+05:30 IST

‘నాగొంతులో ప్రాణం ఉన్నంత వరకు నమ్ముకున్న కార్యకర్తలకు అండగా ఉంటా....ఎవ్వరినీ మరచి పోను’ అని దర్శి శాసన సభ్యులు మద్దిశెట్టి వేణుగోపాల్‌ అన్నారు.

ఊపిరున్నంత వరకు అండగా ఉంటా
మాట్లాడున్నమద్దిశెట్టి వేణుగోపాల్‌

ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌

ముండ్లమూరు ఆగస్టు 3 : ‘నాగొంతులో ప్రాణం ఉన్నంత వరకు నమ్ముకున్న కార్యకర్తలకు అండగా ఉంటా....ఎవ్వరినీ మరచి పోను’ అని దర్శి శాసన సభ్యులు మద్దిశెట్టి వేణుగోపాల్‌ అన్నారు. సోమవారం ఆయన జన్మదినం సందర్భంగా మండలంలోని పసుపుగల్లులో గ్రామ వైసీపీ నాయకుడు బిజ్జం వెంకట సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో భారీగా ఏర్పాటు చేసిన కేక్‌ను ఎమ్మెల్యే వేణుగోపాల్‌, ఆయన సోదరుడు శ్రీధర్‌ సమక్షంలో కట్‌ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేణుగోపాల్‌ మాట్లాడుతూ నా పుట్టిన రోజు సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు చూపిన అభిమానం జీవితంలో మరచి పోలేనన్నారు. నియోజక వర్గ అభివృద్ధే ధ్యేయంగా పని చేసి ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. ఈ జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుంకర బ్రహ్మానందరెడ్డి, మండల ఇన్‌చార్జ్‌ చెన్నంశెట్టి రాంబాబు, సొసైటీ అధ్యక్షులు బద్రి వెంకట సుబ్బారెడ్డి, గోనుగుంట్ల వెంకటేశ్వర్లు, చింతల రామకృష్ణారెడ్డి, అంబటి వెంకటేశ్వరరెడ్డి, బిజ్జం వెంకట సుబ్బారెడ్డి, మొదుళ్ళ వెంకట సుబ్బారెడ్డి, సర్పంచ్‌లు గోరంట్ల రాంబాబు,  నలమోలు వెంకటేశ్వరరావు, కందిమళ్ళ గీతాంజలి, మేడికొండ జయంతి, వేముల శ్రీనివాసులు, ఒగులూరి రామాంజీ, జమ్ముల గురవయ్య, జనమాల పిచ్చయ్య, గర్నెపూడి ప్రసన్న కుమార్‌, జాను, ఉల్లి కృష్ణ, పవన కుమార్‌, చింతా వెంకట శ్రీనివాసరెడ్డి, పాలెపోగు డగ్లస్‌, జానకి రామయ్య, గువ్వల శ్రీనివాసరెడ్డి, శ్రీహర్ష తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-04T06:24:13+05:30 IST