మువ్వన్నెల జెండా రెపరెపలు
ABN , First Publish Date - 2022-08-12T04:44:56+05:30 IST
ప్రభుత్వం చేపడుతున్న ఆజాది కా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా గురువారం లక్కిరెడ్డిపల్లె, రామాపురం మండలాల్లోని చౌటపల్లె, అనంతపురం, కుర్నూతల గ్రామాల్లో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు చేపట్టారు.
ఘనంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు
లక్కిరెడ్డిపల్లె / రామాపురం, ఆగస్టు 11: ప్రభుత్వం చేపడుతున్న ఆజాది కా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా గురువారం లక్కిరెడ్డిపల్లె, రామాపురం మండలాల్లోని చౌటపల్లె, అనంతపురం, కుర్నూతల గ్రామాల్లో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు చేపట్టారు. చౌటపల్లె అనంతపురం గ్రామాల్లో విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. అనంతరం చౌటపల్లె చెరువులో అమృత సరోవర్ పథకం కింద పనులు చేస్తున్న ఉపాధి హామీ పథకం సిబ్బంది ఉపాధి కూలీలు త్రివర్ణ పతాకాలతో ర్యాలీ నిర్వహించారు. అమృత సరోవర్ పథకం కింద ఎంపికైన చెరువులకు హారతులు ఇచ్చి జెండా వందనాలు చేశారు. కార్యక్రమంలో ఏపీవో పెంచలయ్య, జేఈ వెంకటపతి, ఉపాధి టెక్నికల్ ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉపాధి కూలీలు పాల్గొన్నారు. రామాపురం మండలంలోని సుద్దమళ్ల పంచాయతీ పరిధిలోని ఓబుల్రెడ్డి చెరువు కట్టపై గురువారం జాతీయ జెండాతో ఉపాధి సిబ్బంది, విద్యార్థులు ప్రదర్శనలు చేశారు. కార్యక్రమంలో డ్వామా పీడి శివప్రసాద్, ఎంఈవో రామకృష్ణుడు, ఏపీవో సురేంద్రనాథరెడ్డి, ఉపాధి సిబ్బంది, కూలీలు, విద్యార్థులు పాల్గొన్నారు.