త్వరలో అందుబాటులోకి ముత్యాలమ్మ కోనేరు
ABN , First Publish Date - 2021-10-26T04:51:45+05:30 IST
పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలోని ముత్యాలమ్మ కోనేరు-నెహ్రూ పార్కును ప్రజలకు అందుబాటులో తీసు కువస్తామని ప్రజారోగ్యశాఖ ఈఈ సుగుణాకర్ తెలిపారు. ఈ మేర కు సోమవారం పార్కు అభివృద్ధి పనులు పరిశీలించారు. మునిసి పల్ చైర్మన్ బళ్ల గిరిబాబు, కమిషనర్ టి.రాజగోపాలరావు ఆయనను కలిసి పార్కు పనులు వేగవంతం చేయాలని కోరారు.
ప్రజారోగ్య శాఖ ఈఈ సుగుణాకర్
పలాస, అక్టోబరు 25: పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలోని ముత్యాలమ్మ కోనేరు-నెహ్రూ పార్కును ప్రజలకు అందుబాటులో తీసు కువస్తామని ప్రజారోగ్యశాఖ ఈఈ సుగుణాకర్ తెలిపారు. ఈ మేరకు సోమవారం పార్కు అభివృద్ధి పనులు పరిశీలించారు. మునిసి పల్ చైర్మన్ బళ్ల గిరిబాబు, కమిషనర్ టి.రాజగోపాలరావు ఆయనను కలిసి పార్కు పనులు వేగవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఈఈ మాట్లాడుతూ.. రూ. 70 లక్షలతో పార్కును అభివృద్ధి చేయాలని సంకల్పించామన్నారు. కాంట్రాక్టర్లు పనులు మధ్యలో నిలిపి వేశారని చెప్పారు. ప్రజలకు పార్కు సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించామని, మరో కాంట్రాక్టర్కి పనులు అప్పగిస్తామన్నారు. ప్రస్తు తం రూ.ఐదు లక్షలతో నడక దారి, కుర్చీలు ఏర్పాటు చేస్తు న్నామన్నారు. ఈ పనులు త్వర గా చేయాలని ఏఈ అవినాష్ కు ఆదేశించారు. అంతకు ముందు మునిసిపాలిటీలో నిర్మిస్తున్న కాలువల పనులను పరిశీలించారు.