ఏబీఎన్‌కు ముత్తిరెడ్డి క్షమాపణ చెప్పాలి:

ABN , First Publish Date - 2021-02-27T23:28:36+05:30 IST

ఏబీఎన్‌ ఛానెల్ పై దాడికి ఉసిగొల్పిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

ఏబీఎన్‌కు ముత్తిరెడ్డి క్షమాపణ చెప్పాలి:

జనగామ: ఏబీఎన్‌ ఛానెల్ పై దాడికి ఉసిగొల్పిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తక్షణమే ఏబీఎన్ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. జిల్లాలోని పోతారం గ్రామంలో దెయ్యం లేదని చెప్పేందుకు ఏబీఎన్ తన సిబ్బందితో కలిసి గ్రామానికి వెళ్లింది. గ్రామానికి వెళ్లిన ఏబీఎన్‌ పై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి దాడికి ఉసిగొల్పాడని బీజేపీ ఆరోపించింది. నర్మెట మండల కేంద్రంలో ఎమ్మెల్యే యాదగిరిరెడ్డికి వ్యతిరేకంగా విపక్షాల ఆందోళన చేశాయి. అలాగే మండల కేంద్రంలో బీజేపీ నిరసన వ్యక్తం చేసింది. తన కబ్జాలు బయటకు రాకుండా ఉండేందుకు ఏబీఎన్ పై ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి దాడికి ఉసిగొల్పడం దారుణమని ఆరోపించాయి. ఏబీఎన్‌కు ముత్తిరెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలన్నాయి. 

Updated Date - 2021-02-27T23:28:36+05:30 IST