ఇమ్మిగ్రెంట్లపై పోలీసు నిఘా!

ABN , First Publish Date - 2020-02-21T06:50:30+05:30 IST

రాష్ట్రంలో అక్రమంగా ఉంటోన్న విదేశీయులపై పోలీసులు నిఘాను కట్టుదిట్టం చేస్తున్నారు. ఇమ్మిగ్రెంట్లకు రక్షణ కల్పించడంతోపాటు..

ఇమ్మిగ్రెంట్లపై పోలీసు నిఘా!

  • 24 గంటల్లో ఫామ్‌-సీ అందించాల్సిందే
  • విద్య, పర్యాటకం.. వీసా ఏదైనా తప్పనిసరి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అక్రమంగా ఉంటోన్న విదేశీయులపై పోలీసులు నిఘాను కట్టుదిట్టం చేస్తున్నారు. ఇమ్మిగ్రెంట్లకు రక్షణ కల్పించడంతోపాటు.. గడువుదాటినా ఇక్కడే తిష్ఠవేస్తున్న వారిని వెనక్కి పంపేందుకు సన్నద్ధమవుతున్నారు. విద్యా, పర్యాటకం, వైద్యం.. ఇలా వేర్వేరు కారణాలతో రాష్ట్రానికి వస్తున్న విదేశీయులు.. 24 గంటల్లో తప్పనిసరిగా ఫామ్‌-సీని అందజేయాలనే నిబంధనను తప్పనిసరి చేశారు. దీనిద్వారా వీసాగడువు ముగిసిన వారిని సులువుగా గుర్తించే అవకాశలున్నాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. విదేశీయులకు ఆశ్రయం ఇస్తున్న లాడ్జిలు, హోటళ్ల నిర్వాహకులు.. బస్తీలు, కాలనీల్లో స్థానికులు కూడా ఆ సమాచారాన్ని పోలీసులకు అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. రెండు రోజుల క్రితం యెమన్‌ దేశస్థుడిని అరెస్టు చేసిన నేపథ్యంలో..  పోలీసు శాఖ చర్యలు చేపట్టింది.

Updated Date - 2020-02-21T06:50:30+05:30 IST