పోటీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరచాలి

ABN , First Publish Date - 2022-07-01T06:34:33+05:30 IST

విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరచి ఉద్యోగాలు సాధించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ వుంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆకాంక్షించారు.

పోటీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరచాలి
మాట్లాడుతున్న మంత్రి కొప్పుల

మంత్రి కొప్పుల ఈశ్వర్‌

ధర్మపురి, జూన్‌ 30: విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరచి ఉద్యోగాలు సాధించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ వుంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆకాంక్షించారు. ధర్మపురి పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపంలో ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ, ఎల్‌ఎం కొప్పుల సోషల్‌ సర్వీసెస్‌ ఆర్గనైజే షన్‌ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ, యువకులకు పోలీస్‌ పరీక్షల ఉచిత శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమానికి గురువారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ, యువకులు రాబో యే పరీక్షలో ఉత్తీర్ణులై పోలీస్‌ శాఖలో మంచి ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. రెండు నెలల పాటు శిక్షణ అందించిన కరీంనగర్‌ లక్ష్యం అకాడమీ డైరెక్టర్‌ ఉమాప్రసాద్‌ను ఆయన అభినందిం చారు.  కార్యక్రమంలో ఎల్‌ఎం కొప్పుల చారిటబుల్‌ ట్రస్టు అధ్యక్షురా లు కొప్పుల స్నేహలత, కరీంనగర్‌ డీసీఎంఎస్‌ చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, ధర్మపురి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సంగి సత్యమ్మ, ఎంపీపీ ఎడ్ల చిట్టిబాబు, జడ్పీటీసీ బత్తిని అరుణ, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-07-01T06:34:33+05:30 IST