చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

ABN , First Publish Date - 2021-10-24T06:24:07+05:30 IST

చట్టాలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పెద్దపల్లి సీనియర్‌ సివిల్‌ జడ్జి డీ వరూధుని అన్నారు.

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
బొట్లవనపర్తిలో మాట్లాడుతున్న సీనియర్‌ సివిల్‌ జడ్జి వరూధిని

- పెద్దపల్లి సీనియర్‌ సివిల్‌ జడ్జి వరూధిని

ధర్మారం, అక్టోబరు 23:చట్టాలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పెద్దపల్లి సీనియర్‌ సివిల్‌ జడ్జి డీ వరూధుని అన్నారు. శనివారం ధర్మారం మండలం బొట్లవనపర్తి గ్రామంలో చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. చట్టం గురించి ప్రజలు పూర్తి స్థాయిలో తెలుసుకోవాలన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలకు చట్టాలపై అవగాహన ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ సదస్సులు నిర్వహిస్తున్నట్టు ఆమె చెప్పారు. ఈ సదస్సులో సర్పంచ్‌ రెడపాక ప్రమీల, పెద్దపల్లి బార్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడు రమణారెడ్డి, నోటరీలు బొట్ల లక్ష్మీ నర్సయ్య, ఠాకూర్‌ హన్మాన్‌సింగ్‌, అకారి రాజేశం, రమేష్‌ తదితరు లు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-24T06:24:07+05:30 IST