జాతీయ స్థాయికి ఎదగాలి : డీఈవో
ABN , First Publish Date - 2021-03-03T05:08:39+05:30 IST
విద్యార్థులు చదువుతో పాటుగా క్రీడల్లో రాణించి జాతీయస్థాయికి ఎదగాలని డీఈవో రవీందర్ కోరారు.
ధన్వాడ, ఫిబ్రవరి 2 : విద్యార్థులు చదువుతో పాటుగా క్రీడల్లో రాణించి జాతీయస్థాయికి ఎదగాలని డీఈవో రవీందర్ కోరారు. ధన్వాడ బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం ఉమ్మ డి జిల్లాస్థాయి కుస్తీ పోటీలు నిర్వహించారు. ఈ క్రీడలను డీఈవో రవీందర్, జీహెచ్ఎం రమేష్లు ప్రారంభించారు. మహబూబ్నగర్, గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్, నారాయణపేట జిల్లాల నుంచి 30 మందికిపై కుస్తీ పోటీల క్రీడాకారులు పాల్గొన్నారు. ఇక్కడ ఎంపికైన విద్యా ర్థులు రాష్ట్రస్థాయిలో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. పీఈటీలు రాంకల్యాణ్జీ, ఊసు రవికుమార్, సాయినాథ్, జ్యోతిర్మయి, కోచర్ శ్రీనివాస్లు పాల్గొన్నారు.