ప్రజల మన్ననలు పొందాలి: ఎస్పీ
ABN , First Publish Date - 2022-05-21T04:30:22+05:30 IST
నీతి నిజాయతీతో ప్రజల మన్ననలు పొందేలా విధులు నిర్వహించా లని ఎస్పీ వెంకటేశ్వర్లు సూచించారు.
నారాయణపేట క్రైం, మే 20: నీతి నిజాయతీతో ప్రజల మన్ననలు పొందేలా విధులు నిర్వహించా లని ఎస్పీ వెంకటేశ్వర్లు సూచించారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయ ఆవరణలో కాన్ఫరెన్స్ హాల్ నూ తన భవాన్ని ఎస్పీ ప్రారంభించారు. అంతకుముం దు సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరిం చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జి ల్లాలోని పోలీసులు బాగా పని చేస్తున్నారని ఇక ముందు ఇదే ఉత్సాహంతో మరింత కష్టపడి పని చేయాలని సూచించారు. సమాజంలోని ప్రజలు పోలీసులు చేసే ప్రతీ పనిని పరిశీలిస్తారని అది గ మనిస్తూ విధులు నిర్వహించాలని కోరారు. ప్రజల తో మర్యాదగా మాట్లాడాలని, పీఎస్కు వచ్చే వారి సమస్యలను మర్యాద పూర్వకంగా విని పరిష్కరిం చాలన్నారు. పీఎస్ల వారిగా టార్గెట్ విధించుకొని పెండింగ్ కేసులను క్లియర్ చేయాలని, దీనికోసం కోర్టు, మెడికల్ అధికారులతో సమన్వయం కలిగి పని చేయాలన్నారు. పోలీస్ సిబ్బంది ప్రతీరోజు యోగా సాధన చేస్తూ తమ ఆరోగ్యాన్ని కాపాడు కో వాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ భరత్, డీఎస్పీలు సత్యనారాయణ, వెంకటేశ్వర రావు, సీఐలు సీతయ్య, శ్రీకాంత్రెడ్డి, రామ్లాల్, ఆర్ఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.