మహానాడులోగా సభ్యత్వం పూర్తిచేయాలి: చంద్రబాబు

ABN , First Publish Date - 2022-05-01T00:19:49+05:30 IST

మహానాడులోగా సభ్యత్వం పూర్తిచేయాలని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు. శనివారం టీ.టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం అయ్యారు.

మహానాడులోగా సభ్యత్వం పూర్తిచేయాలి: చంద్రబాబు

హైదరాబాద్: మహానాడులోగా సభ్యత్వం పూర్తిచేయాలని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు. శనివారం టీ.టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం అయ్యారు. టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై చర్చించారు. ఖమ్మం, హైదరాబాద్ మినహా మందకొడిగా సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతోందని చెప్పారు. సభ్యత్వ నమోదు నూతన విధానంపై అవగాహన లేక.. ఇబ్బంది పడుతున్నామని పలువురు నేతలు చంద్రబాబుకు తెలిపారు. సభ్యత్వ నమోదుపై నేతలకు  చంద్రబాబు సూచనలు చేశారు.సభ్యత్వ నమోదుపై నియోజకవర్గ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశారు.రంజాన్ దృష్ట్యా పేద ముస్లిం మహిళలకు  చంద్రబాబు చీరలు పంపిణీ చేశారు.

Updated Date - 2022-05-01T00:19:49+05:30 IST