కరోనాపై అప్రమత్తంగా ఉండాలి
ABN , First Publish Date - 2020-05-23T10:09:30+05:30 IST
కరోనాపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, భౌతిక దూరం పాటించాలని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. శుక్రవారం మధిర
మాజీ ఎంపీ పొంగులేటి
మధిర రూరల్, మే 22: కరోనాపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, భౌతిక దూరం పాటించాలని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. శుక్రవారం మధిర మండలం మాటూరు గ్రామంలో ప్రజలకు ఆయన మాస్క్లు, శానిటైజర్లు పంపిణీ చేశారు.
డాక్టర్ కృష్ణమాచారిని పరామర్శించిన పొంగులేటి
మాటూరు గ్రామంలో సీనియర్ నాయకుడు, ప్రముఖ వైద్యులైన ఎన్.కృష్ణమాచార్యులను మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వైద్యఖర్చులకు ఆర్థికసహాయాన్ని పొంగులేటి అందించారు. కార్యక్రమంలో జడ్పీచైర్మన్ లింగాల కమలరాజు, మాటూరు, మాటూరుపేట సర్పంచ్లు మేడిశెట్టి లీలావతి, రావూరి శివనాగకుమారి, పలుగ్రామాల టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.