కాలపరిమితిలోపే సేవలందించాలి
ABN , First Publish Date - 2020-09-24T07:53:57+05:30 IST
గ్రామ, వార్డు సచివాలయాల్లో నిర్ణీత కాలపరిమితిలో సేవలు అందించాలని అమలాపురం సబ్కలెక్టర్ హిమాన్షు కౌశిక్ అధికారులను ఆదేశించారు
ఆత్రేయపురం: గ్రామ, వార్డు సచివాలయాల్లో నిర్ణీత కాలపరిమితిలో సేవలు అందించాలని అమలాపురం సబ్కలెక్టర్ హిమాన్షు కౌశిక్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆత్రేయపురం రెవెన్యూ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ ఇచ్చారు. స్పందన, సచివాలయాల్లో సమస్యలపై ప్రజలు ఇచ్చే అర్జీలను సత్వరం పరిష్కరించాలని కోరారు. వివిధ పథకాలకు సంబంధించి సాఫ్ట్వేర్లో ఎలా లాగిన్ అవ్వాలో, ఏఏ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి అనే అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఎంపీడీవో నాతి బుజ్జి, తహశీల్దార్ రామకృష్ణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.