డిమాండ్ల సాధనకు ఉద్యమించాలి

ABN , First Publish Date - 2022-01-17T06:24:45+05:30 IST

తెలంగాణ వార్డు సభ్యుల ఫోరం డిమాండ్లను సాధించుకునే వరకు ఉద్యమించాలని ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కొండ నవీన్‌ అన్నారు. శనివారం సిరిసిల్ల పట్టణం రాజరాజేశ్వర ఫంక్షన్‌ హాల్లో ఫోరం ముఖ్యనాయకుల సమావేశంలో ఫోరం 2022 సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.

డిమాండ్ల సాధనకు ఉద్యమించాలి
సిరిసిల్లలో క్యాలెండర్‌ ఆవిష్కరిస్తున్న ఫోరం నాయకులు

సిరిసిల్లటౌన్‌, జనవరి 16: తెలంగాణ వార్డు సభ్యుల ఫోరం డిమాండ్లను సాధించుకునే  వరకు ఉద్యమించాలని  ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కొండ నవీన్‌ అన్నారు. శనివారం సిరిసిల్ల పట్టణం రాజరాజేశ్వర ఫంక్షన్‌ హాల్లో ఫోరం ముఖ్యనాయకుల సమావేశంలో  ఫోరం 2022 సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  వార్డు సభ్యులకు గౌరవ వేతనం రూ.3వేలు, ప్రమాద బీమా, శిక్షణ తరగతులు, 30 శాతం నిధులు మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో ఫోరం జిల్లా అధ్యక్షుడు చెట్టిపల్లి నరేష్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు అందె మహేందర్‌, మల్లేష్‌, జిల్లా ఉపాధ్యక్షులు అంజేనేయులు, శివరాం, జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యరెడ్డి, నాయకులు కడారి రాధికవెంకటేష్‌, శేరి స్వప్నరాజిరెడ్డి, మహేష్‌, గణేష్‌, బాలకిషన్‌, బండ రమేష్‌, రాజ్‌కుమార్‌, కనకరాజు, మజీద్‌, రాజ్‌కిరణ్‌, గోపాల్‌, రాజు, రాకేష్‌, గోవర్ధన్‌, శ్రీను, రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

రుద్రంగి : రుద్రంగి మండలం మనాల గ్రామంలోని గ్రామపంచాయతీ ఆవరణంలో రాష్ట్ర వార్డ్‌ మెంబర్స్‌ ఫోరం నూతన సంవత్సర క్యాలెండర్‌ను  ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దండిగపు మల్లేశం ఆదివారం ఆవిష్కరించారు.  కార్యక్రమంలో సర్పంచ్‌  మానస, నాయకులు జక్కు మోహన్‌, అంజయ్య తదితరులు పాల్గొన్నారు

Updated Date - 2022-01-17T06:24:45+05:30 IST