రైతుల పోరాటాల స్ఫూర్తితో ఉద్యమించాలి

ABN , First Publish Date - 2021-11-27T06:18:07+05:30 IST

కేంద్ర చట్టాలపై అవిశ్రాంత పోరాటం చేసి విజయం సాధించిన రైతులను కార్మికులు ఆదర్శంగా తీసుకుని, ప్రైవేటీకరణ వంటి అంశాలపై ఐక్యంగా పోరాడాలని భెల్‌ హెచ్‌పీవీపీ గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షుడు ఉరుకూటి బాబూరావు అన్నారు

రైతుల పోరాటాల స్ఫూర్తితో ఉద్యమించాలి
భెల్‌ మెయిన్‌ గేటు వద్ద నిరసన తెలుపుతున్న కార్మికులు

భెల్‌ హెచ్‌పీవీపీ గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షుడు  బాబూరావు 

అక్కిరెడ్డిపాలెం, నవంబరు 26: కేంద్ర చట్టాలపై అవిశ్రాంత పోరాటం చేసి విజయం సాధించిన రైతులను కార్మికులు ఆదర్శంగా తీసుకుని,  ప్రైవేటీకరణ వంటి అంశాలపై ఐక్యంగా పోరాడాలని భెల్‌ హెచ్‌పీవీపీ గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షుడు ఉరుకూటి బాబూరావు అన్నారు. పలు సమస్యల పరిష్కారం కోరుతూ భెల్‌ సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం భెల్‌ మెయిన్‌ గేటు వద్ద  కార్మికులు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో  ఆయన పాల్గొన్నారు. రైతులు సాధించిన విజయంపై హర్షం వ్యక్తం చేశారు. సీఐటీయూ ప్రధాన కార్యదర్శి జీటీపీ ప్రకాశ్‌ మాట్లాడుతూ కర్మాగారంలో ఎంతో కాలంగా పరిష్కారానికి నోచుకోని సమస్యలపై కార్మికులు ఐక్యంగా పోరాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో చింతా అప్పలనాయుడు,  కొల్లి దేముడు, ఎ.వెంకటేశ్వరరావు, ఎస్‌.సాహు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-27T06:18:07+05:30 IST