హిందూ వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించిన ముస్లింలు

ABN , First Publish Date - 2020-05-27T03:21:49+05:30 IST

హిందూ మతానికి చెందిన ఓ వ్యక్తి మరణించగా ముస్లిం యువలకులు అంత్రక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. మహారాష్ట్రలోని అకోలాకు చెందిన 78 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. అయితే

హిందూ వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించిన ముస్లింలు

ముంబై: దేశంలో ఒక పక్క మతాల మధ్య అంతరం పెరిగిపోతోంది. అయితే మానవత్వం ఇంకా బతికే ఉంది అన్నట్లు కొందరు గుర్తు చూస్తూ ఉంటారు. మానవత్వం అంటే మతాలకు, ప్రాంతాలకు అతీతమని.. విశ్వమానవ శ్రేయస్సు అని చాటుతుంటారు. మహారష్ట్రలోని అకోలాలో జరిగిన తాజా సంఘటనే ఇందుకు ఉదాహారణ.


హిందూ మతానికి చెందిన ఓ వ్యక్తి మరణించగా ముస్లిం యువలకులు అంత్రక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. మహారాష్ట్రలోని అకోలాకు చెందిన 78 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. అయితే ఆ ప్రాంతంలోనే నివాసం ఉంటున్న ముస్లిం యువకులు అంత్యక్రియలు నిర్వహించారు. వాస్తవానికి కుటుంబ సభ్యులు ఆ యువకుల్ని వారించారు. దీనికి కారణం లేకపోలేదు. చనిపోయిన వ్యక్తి భార్య క్వారంటైన్‌లో ఉండడమే. అయినప్పటికీ యువకులు అంత్యక్రియలు పూర్తి చేశారు.

Updated Date - 2020-05-27T03:21:49+05:30 IST