దైవారాధన చేయడమే అతని వృత్తి.. కానీ కామాంధుడై ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2022-01-28T05:38:28+05:30 IST

అతను ఓ మసీదులో ఇమామ్. రోజుకు 5 సార్లు నమాజ్ చదివిస్తాడు. సాయంత్రం పిల్లలకు అరబీ పాఠాలు నేర్పుతాడు. అలాంటి వ్యక్తి కామంతో కళ్లుమూసుకుపోయి ఒక బాలికపై అత్యాచారం చేశాడు. వివరాల్లోకి వెళితే..

దైవారాధన చేయడమే అతని వృత్తి.. కానీ కామాంధుడై ఏం చేశాడంటే..

అతను ఓ మసీదులో ఇమామ్. రోజుకు 5 సార్లు నమాజ్ చదివిస్తాడు. సాయంత్రం పిల్లలకు అరబీ పాఠాలు నేర్పుతాడు. అలాంటి వ్యక్తి కామంతో కళ్లుమూసుకుపోయి ఒక బాలికపై అత్యాచారం చేశాడు. వివరాల్లోకి వెళితే..


ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం మైన్‌పూరీ జిల్లాలో ఒక మసీదులో ఇమాం రషీద్(పేరు మార్చబడినది) నమాజ్ చదివించే పని చేసేవాడు. అలాగే రోజూ సాయంత్రం మసీదు ప్రాంగణంలోని తన గదిలో పిల్లలకు అరబీ బోధించేవాడు. ఒక రోజు సాయంత్రం పిల్లలందరికీ అరబీ పాఠాలు బోధించాక ఇంటికి పంపించాడు. కానీ ఒక ఎనిమిదేళ్ల బాలికను మాత్రం ఇంటికి పంపలేదు. ఆమెకు ఇంకా పాఠాలు నేర్పాలా ఆగిపోమన్నాడు. ఆ తరువాత ఆ బాలికను గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.


అత్యాచారం చేసిన తరువాత జరిగిన విషయం బయట ఎవరికీ చెప్పకూడదని అల్లా(దేవుడి) పై ప్రమాణం చేయించాడు. కానీ బాధితురాలు ఇంటికి చేరే సరికి ఆమె బట్టలపై రక్తపు మరకలు చూసి తల్లిదండ్రులు ఏం జరిగిందని అడిగారు. దానికి ఆ పాప ఏడుస్తూ జరిగిన విషయం చెప్పింది. ఇది విన్న పాప తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఇమాం రషీద్‌పై ఫిర్యాదు చేశారు.


పోలీసులు పోక్సో చట్టం కింద ఇమాం రషీద్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

Updated Date - 2022-01-28T05:38:28+05:30 IST