నలుగురు బాలికలను రక్షించిన ముస్కాన్‌ టీం

ABN , First Publish Date - 2022-07-07T13:38:08+05:30 IST

మహిళలు చిన్నారుల అక్రమ రవాణాపై రాచకొండ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది జూలై 1న ఆపరేషన్‌ ముస్కాన్‌-8ని ప్రారంభించారు..

నలుగురు బాలికలను రక్షించిన ముస్కాన్‌ టీం

హైదరాబాద్‌ సిటీ: మహిళలు చిన్నారుల అక్రమ రవాణాపై రాచకొండ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది జూలై 1న ఆపరేషన్‌ ముస్కాన్‌-8ని ప్రారంభించారు. ఈ క్రమంలో ఆపరేషన్‌ ముస్కాన్‌ టీంతో పాటు.. అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ అధికారులతో కలిసి సంయుక్తంగా రిషబ్‌ ఇండస్ట్రీ్‌సపై దాడులు జరిపారు. ఛత్తీ్‌సగఢ్‌ నుంచి అక్రమంగా రవాణా చేసిన బాలికలతో వెట్టిచాకిరీ చేయిస్తున్నట్లు గుర్తించారు. రాజస్థాన్‌కు చెందిన ఇండస్ట్రీ యజమాని నరేష్‌ జైన్‌పై కేసులు నమోదు చేశారు. డిస్పోజల్‌ కంపెనీలో పనిచేస్తున్న నలుగురు బాలికలను రక్షించిన ముస్కాన్‌ టీం ప్రభుత్వ హోమ్‌కు తరలించింది. రోజుకు 12గంటలు పనిచేయిస్తున్న కంపెనీ యాజమాన్యం వారికి రోజుకు రూ.270 చెల్లిస్తున్నట్లు గుర్తించారు. ఇదే తరహాలో మరిన్ని కంపెనీలు, కార్ఖానాలు,దుకాణాలు, ఫాస్టుఫుడ్‌ సెంటర్‌లపై దాడులు నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు.

Updated Date - 2022-07-07T13:38:08+05:30 IST