ఈనెల 7న గుల్దస్తా సంగీత కార్యక్రమం

ABN , First Publish Date - 2021-03-05T12:23:30+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ, సూర్మాండాల్‌ సాంస్కృతిక శాఖ

ఈనెల 7న గుల్దస్తా సంగీత కార్యక్రమం

హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ, సూర్మాండాల్‌ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఆదివారం గుల్దస్తా సంగీత కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలంగాణ పౌర సంబంధాల శాఖ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. మొజంజాహీ మార్కెట్‌ ఆవరణలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దివంగత శ్రీ బీపీ సింగ్‌కు నివాళులర్పించడానికి గుల్దస్తా కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కలలు, సాంస్కృతిక వ్యాప్తిలో కీలక పాత్ర పోషించిన వి.ఎస్‌.టీ ఇండస్ట్రీస్‌ మాజీ డైరెక్టర్‌ బి.పి సింగ్‌ కేన్సర్‌ వ్యాధితో ఢిల్లీలో కన్నుమూశారు. ఈ కార్యక్రమానికి ఎంఎస్‌ విభ హెగ్డే, యువ ప్రతిభా వంతులు హిందుస్తానీ శాస్త్రీయ గాయకుడు ఆర్నాట్‌ భట్టాచార్య, సరోద్‌ హాజరై ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు తెలిపారు. పూర్వ గురూ ప్రఖ్యాత సూఫీ గజల్స్‌ను ప్రదర్శిస్తారని నిర్వాహకులు తెలిపారు. 

Updated Date - 2021-03-05T12:23:30+05:30 IST