మూసీ పరివాహక ప్రాంతాల్లో కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక

ABN , First Publish Date - 2021-09-29T16:15:49+05:30 IST

మూసీ పరివాహక ప్రాంతాల్లో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

మూసీ పరివాహక ప్రాంతాల్లో కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక

హైదరాబాద్: మూసీ పరివాహక ప్రాంతాల్లో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. హిమాయత్ సాగర్ 10 గేట్లు.. ఉస్మాన్ సాగర్ 6 గేట్లు ఎత్తడంతో మూసీలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జియాగూడ నుంచి పురానా పూల్ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. పురానాపూల్ 100ఫీట్ రోడ్డు మీదకు భారీగా వరద నీరు వచ్చి చేరింది.  అధికారులు మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను ఇళ్ల నుంచి ఖాళీ చేయించారు. 

Updated Date - 2021-09-29T16:15:49+05:30 IST