‘ముషంపల్లి’ ఘటన అమానవీయం: జగదీష్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-10-07T01:41:02+05:30 IST

నల్లగొండ జిల్లా ముషంపల్లిలో మహిళపై లైంగికదాడి, హత్య ఘటనలో బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి

‘ముషంపల్లి’ ఘటన అమానవీయం: జగదీష్‌రెడ్డి

నల్లగొండ: నల్లగొండ జిల్లా ముషంపల్లిలో మహిళపై లైంగికదాడి, హత్య ఘటనలో బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి భరోసా ఇచ్చారు. గత నెల 22వ తేదీన నల్లగొండ మండలంలోని ముషంపల్లి గ్రామంలో మహిళపై ఇద్దరు సామూహిక అత్యాచారం చేసి హత్యచేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం తెలిసింది బాధితురాలి కుటుంబాన్ని మంత్రి జగదీష్‌రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి బుధవారం పరామర్శించి ఆమె చిత్ర పటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ ముషంపల్లి తరహా ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరఫున రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియోను త్వరలో జిల్లా కలెక్టర్‌ అందజేస్తారని జగదీష్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2021-10-07T01:41:02+05:30 IST