స్వచ్ఛందంగా మురుగు కాల్వ శుభ్రం
ABN , First Publish Date - 2020-12-01T04:21:24+05:30 IST
స్వచ్ఛందంగా మురుగు కాల్వ శుభ్రం
దోమ: లింగన్పల్లి అనుబంధ గ్రామమైన ఎల్లారెడ్డిపల్లిలో నెలలు గడుస్తున్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు పారిశుధ్య నిర్వహణకు చర్యలు తీసుకోకపోవడంతో సోమవారం గ్రామస్థులే స్వచ్చందంగా ముందుకొచ్చి మురుగు కాలువలు శుభ్రం చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్థులు మాట్లాడుతూ, సర్పంచ్, కార్యదర్శి అనుబంధ గ్రామ అభివృద్ధిని పట్టించుకోవడం లేదన్నారు. గ్రామంలో మురుగు కాలువలు శుభ్రం చేయకపోవడంతో దుర్గంధం వెదజల్లుతోందన్నారు. సంబంధిత అధికారులకుపలుమార్లు విన్నవించినా పట్టించుకోక పోవ డంతో తామే మురుగు కాలువలు శుభ్రం చేసుకోవడం జరిగిందన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గ్రామంలో కనీస వసతులు కల్పించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.