వికారాబాద్‎లో వ్యక్తి దారుణ హత్య

ABN , First Publish Date - 2021-03-02T17:16:16+05:30 IST

బొంరస్‎పేట మండలంలో దారుణం జరిగింది. కుర్వ చంద్రయ్య (52)అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు అతికిరాతకంగా హత్య చేశారు. గ్రామ శివారులోని ఎల్లమ్మ చెరువు దగ్గర చంద్రయ్య తల, మొండెం వేరు...

వికారాబాద్‎లో వ్యక్తి దారుణ హత్య

వికారాబాద్ : బొంరస్‎పేట మండలంలో దారుణం జరిగింది. కుర్వ చంద్రయ్య (52)అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు అతికిరాతకంగా హత్య చేశారు.  గ్రామ శివారులోని ఎల్లమ్మ చెరువు దగ్గర చంద్రయ్య తల, మొండెం వేరు చేసి అతి దారుణంగా హత్య చేశారు. తల చెరువులో వేయగా..మొండెం చెట్ల పొదల్లో పడేసారు దుండగులు. ఈ ఘటన మెట్లకుంట గ్రామంలో చోటు చేసుకుంది. అయితే.. ఆదివారం రోజున పొలంకు వెళ్లిన చంద్రయ్య తిరిగి రాకపోవడంతో సోమవారం కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‎కు వెళ్లి ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు చెరువు దగ్గర పోలీసులు గాలింపు చేపట్టడంతో చంద్రయ్య శవం లభ్యమైంది. హత్య చేసిన ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్యకు పాత కక్షలే కారణమని గ్రామస్తులు చెబుతున్నారు. చంద్రయ్య మృతితో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Updated Date - 2021-03-02T17:16:16+05:30 IST