పుట్టిన రోజు పార్టీలో యువకుడి హత్య
ABN , First Publish Date - 2022-01-04T04:12:47+05:30 IST
పుట్టిన రోజు పార్టీలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆదివారం నుంచి ఈ రోజు వరకు ప్రైవేటు లాడ్జిలో 8 మంది యువకులు మందు పార్టీ చేసుకున్నారు. మద్యం మత్తులో...
తిరుపతి: పుట్టిన రోజు పార్టీలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆదివారం నుంచి ఈ రోజు వరకు ప్రైవేటు లాడ్జిలో 8 మంది యువకులు మందు పార్టీ చేసుకున్నారు. మద్యం మత్తులో పరస్పర ఘర్షణకు దిగారు. పుట్టిన రోజు చేసుకుంటున్న ప్రసన్న కుమార్(29)ను సహచర యువకులు వవన్, బాలాజీ, ఎల్లంరెడ్డి మద్యం సీసాలతో పొడిచి చంపారు. ప్రసన్నకుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు రుయా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.