రోడ్డు పైన కారు అడ్డంగా పెట్టాడని గొడవ.. ఆ చిన్న గొడవ ఎంతటి దారుణానికి కారణమైందంటే..

ABN , First Publish Date - 2022-01-25T18:03:40+05:30 IST

రోడ్డు పైన కారు అడ్డంగా నిలిపివేశాడనే కారణంతో మొదలైన గొడవ తీవ్ర పరిణామాలకు కారణమైంది.

రోడ్డు పైన కారు అడ్డంగా పెట్టాడని గొడవ.. ఆ చిన్న గొడవ ఎంతటి దారుణానికి కారణమైందంటే..

రోడ్డు పైన కారు అడ్డంగా నిలిపివేశాడనే కారణంతో మొదలైన గొడవ తీవ్ర పరిణామాలకు కారణమైంది. ఇద్దరూ తీవ్రంగా మద్యం సేవించి ఉండడంతో చిన్న గొడవ పెద్దదిగా మారిపోయింది. ఒక వ్యక్తి హత్యకు కారణమైంది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్‌లోని పాలికి సమీపంలో ఈ ఘటన జరిగింది. 


పాలికి సమీపంలోని రామ్‌దేవ్ రోడ్డు ప్రాంతానికి చెందిన నౌషద్ ఖాన్ అనే వ్యక్తి సోమవారం రాత్రి ఓ పార్టీలో బాగా మద్యం సేవించి తన బైక్‌పై ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. మార్గమధ్యంలో రవి జోషి అనే యువకుడు తన బొలేరో వాహనాన్ని రోడ్డుకు అడ్డంగా ఉంచి టర్న్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. అతను కూడా అప్పటికి మద్యం సేవించి ఉన్నాడు. ఎంతసేపటికీ బొలేరోను రోడ్డు పై నుంచి తీయకపోవడంతో నౌషద్ బైక్ ఆపి రవి దగ్గరకు వెళ్లాడు. వెంటనే కారు పక్కకు తీయమని అడిగాడు. 


ఆ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ గొడవ ముదరడంతో ఇద్దరూ అక్కడే కొట్టుకున్నారు. ఆ క్రమంలో తన బొలేరోలో ఉన్న ఇనుప రాడ్డుతో నౌషద్ తలపై రవి కొట్టాడు. రక్తస్రావం ఎక్కువ కావడంతో నౌషద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు నౌషద్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. రవిని అదుపులోకి తీసుకున్నారు.  

Updated Date - 2022-01-25T18:03:40+05:30 IST